ఒక్క ఫొటో మన చదువుల దుస్థితిని కళ్లకు కట్టింది
టాక్ ఆఫ్ ది ఫొటో.. ఇవీ మన చదువులు.. మన చిన్నప్పుడు 6 ఏళ్ల వయసు వస్తే కానీ తల్లిదండ్రులు స్కూలుకు పంపించేవారు కాదు.. డైరెక్టుగా 1వ తరగతి నుంచే మన చదువులు మొదలయ్యాయి. ఆ సంవత్సరం తెలుగులో ‘అ - ఆ’ నేర్చుకొని కాసిన్ని పదాలు నేర్చుకోగానే 1వ తరగతి పూర్తి అయిపోయేది. మెల్లగా.. నిదానంగా నేర్చుకున్నాం.. అలా చదుకున్నవారు రాష్ట్రపతులు - ఐటీ కంపెనీలకు అధిపతులు - పెద్ద పెద్ద పారిశ్రామిక వేత్తలు - ఐఏఎస్ అధికారులు అయిపోయారు.. కానీ ఇప్పుడు రెండున్నరేళ్లకే పిల్లలను స్కూలుకు పంపుతున్నాం. నర్సరీ నుంచే వారిపై మానసిక ఒత్తిడి పెంచుతున్నాం. వేలకు వేల ఫీజులను ప్రైవేటు స్కూళ్లకు దారపోస్తున్నాం.. ఎల్ కేజీ - యూకేజీ - ఆ తర్వాత 1వ తరగతి.. అంటే మూడు సంవత్సరాలు చదివితే కానీ ఒకటో తరగతి వరకూ రాని పరిస్థితి. మనం ఒకటో తరగతి కి కేవలం పలకా బలపం పట్టుకొని వెళితే ఇప్పుడు పిల్లలు బ్యాగ్ నిండా బండెడు పుస్తకాలతో మోయలేని భారాన్ని మోస్తూ వెళుతున్నారు.. అప్పటికీ ఇప్పటికీ కాలం మారింది.. వేగం పెరిగింది.. కానీ చదువుల్లో మాత్రం మార్పులు బాగా వచ్చాయి. ఆధునిక సమాజంతో పోటీపడాలని పిల్లలను యంత్రాలుగా మారుస్తున్న...